ప్ర‌భుత్వ విప్ గాంధీని క‌లిసిన సోమేశ్వ‌ర దేవ‌స్థానం ఆల‌య‌క‌మిటీ స‌భ్యులు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని సోమేశ్వ‌ర స్వామి దేవ‌స్థాన ఆల‌య‌క‌మిటీ స‌భ్యులు మంగ‌ళ‌వారం క‌మిటీ చైర్మెన్ చెన్నంరాజు ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌భుత్వ విప్‌గాంధీతో పాటు కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌, మాజీ కార్పొరేట‌ర్ కొమిరిశెట్టి సాయిబాబ‌ల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా వారిని శాలువాతో స‌త్క‌రించి మెమొంటోల‌ను అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కమిటి సభ్యులు నరేందర్ గౌడ్, వసంత కుమార్ యాదవ్, ముత్యాల రవీందర్, కాలాకంటి రాధా తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌భుత్వ విప్ గాంధీని మెమోంటోతో స‌త్క‌రిస్తున్న చెన్నంరాజు త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here