చందానగర్ సర్కిల్ లో కొనసాగుతున్న పోలింగ్ జోరు

మధ్యాహ్నం వరకు 19 శాతం చేరుకున్న పోలింగ్

శేరిలింగంపల్లి సర్కిల్ లో 16.3 శాతం

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ లో పోలింగ్ జోరు కొనసాగుతోంది. పోలింగ్ సమయం సగం పూర్తయ్యే సరికి దాదాపు 19 శాతం నమోదైంది. ప్రారంభంలో మందకొడిగా సాగినప్పటికీ క్రమక్రమంగా పోలింగ్ శాతం మెరుగు పడుతూ వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి చందానగర్ సర్కిల్ పరిధిలోని మాదాపూర్ డివిజన్ లో 16.6 , మియాపూర్ డివిజన్ లో 21.7 హఫీజ్ పేట్ డివిజన్ లో 17.3 చందానగర్ డివిజన్ లో 20.1 శాతం పోలింగ్ నమోదు కాగా సర్కిల్ లో సరాసరి పోలింగ్ 18.87 గా ఉంది. గడువు ముగిసే సమయానికి పోలింగ్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్ లలో పోలింగ్ నెమ్మదిగానే కొనసాగింది. మ.1 గం.ల వరకు కొండాపూర్ డివిజన్ లో 14.4 , గచ్చిబౌలి డివిజన్ లో 15.5 శేరిలింగంపల్లి డివిజన్ లో 18.9 శాతం పోలింగ్ నమోదు కాగా సరాసరి పోలింగ్ 16.3 శాతంగా ఉంది.

 

గౌతమి విద్యాక్షేత్ర లో పోలింగ్ నిర్వహణ దృశ్యాలు
పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు
పోలింగ్ కేంద్రం వద్ద వృద్ధురాలికి సహాయం చేస్తున్న శేరిలింగంపల్లి టిఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here