
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి) డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో మూగ జీవాల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ డాగ్స్ అండ్ పెట్స్ బోర్డింగ్ సెంటర్ ను ఆదివారం కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూగ జీవాల పెంపకం కోసం వాటి సంరక్షణ కోసం బోర్డింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. కుక్కలు ఎంతో విశ్వాసం గల జంతువులని కుక్కలను స్వచ్ఛందంగా పెంచడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లల్లో పెంచుకునే యజమానులు ఎక్కడకైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వారి కుక్కలను ఈ కేంద్రంలో సంరక్షించుకునే వెసులుబాటు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డింగ్ నిర్వాహకులు వార్డు మెంబర్లు పొడుగు రాంబాబు, శ్రీకళ, జయమ్మ, భాగ్యలక్ష్మీ, కళ్యాణి,రోజా, శ్రీయా, సన్నీ, శ్రీకాంత్, కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
