పట్టణ ప్రగతితో పరిసరాలను పరిశుభ్రం చేసుకుందాం: కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యాన్ని కాపాడ‌వ‌చ్చ‌ని హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ అన్నారు. సోమవారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియా నగర్ 1, 2, సాయి రామ్ కాలనీ లో నిర్వ‌హించిన ప‌ట్ట‌ణ‌ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పూజిత‌జగదీశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్థానిక ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న‌ సమస్యలను‌ అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొని భాగ‌స్వాములుగా మారి కాల‌నీల అభివృద్దికి పాటుప‌డాల‌ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈ సురేష్, ఏఈ ధీరజ్, సీనియర్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి, శాంతయ్య, హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బల్లింగ్ గౌతమ్ గౌడ్, వార్డ్ సభ్యులు కనకమామిడి వెంకటేష్ గౌడ్, ఏరియా సభ్యులు సుదర్శన్, ప్రవీణ్ గౌడ్, ఉమామహేశ్వర, జితేందర్ రెడ్డి, రవి, సత్యనారాయణ, సురేష్, శ్రీనివాసులు, రాంచందర్, శ్రీనివాస్, శాస్త్రి, ఉమేష్, కృష్ణ, రాజు, రెడ్డి, పరమేశ్వర, అశోక్, కృష్ణయ్య, కలీల్, వర్క్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here