ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపుకై ప్రతీ కార్యకర్త కృషి చేయాలి

హఫీజ్ పేట డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్

స్థానికులకు ఓటరు నమోదు దరఖాస్తులను అందజేస్తున్న బాలింగ్ గౌతమ్ గౌడ్

హఫీజ్ పేట(నమస్తే శేరిలింగంపల్లి): రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కష్టపడి పని చేయాలని హఫీజ్ పేట డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్, సాయి నగర్ లలో గౌతమ్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రాడ్యుయేట్ల తో ఓటరు నమోదు చేయించారు. అనంతరం గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ హఫీజ్ పేట డివిజన్ నుండి అర్హులైన ప్రతీ పట్టభద్రుడితో ఓటరు నమోదు తప్పక చేయించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని ప్రతీ కార్యకర్త తన సొంత విజయంగా భావించి బాధ్యతగా మెలగాలన్నారు. పట్టభధ్రులందరూ ఫారం 18 నింపి ఓటరుగా నమోదు చేయించుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

ఓటరు నమోదు కార్యక్రమంలో స్థానిక యువకులతో గౌతమ్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here