గోపన్ పల్లి తాండ బంజారా యువజన సంఘం అధ్యక్షుడిగా సురేష్ నాయక్

నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన సురేష్ నాయక్ తో యువజన సంఘం సభ్యులు

గచ్చిబౌలి(నమస్తే శేరిలింగంపల్లి): గోపన్ పల్లి తండా బంజారా యువజన సంఘం నూతన అధ్యక్షునిగా బాదావత్ సురేష్ నాయక్ ఎన్నికయ్యారు. శుక్రవారం తాండ నాయకులు, యువత సమక్షంలో యువజన సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్. మోహన్, ప్రధాన కార్యదర్శిగా ఎన్.హనుమంతు లతో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ తాండ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. నూతన కమిటీ సభ్యులకు స్థానిక నాయకులు, యువకులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాములు, గోపి, రాజు, నర్సింగ్, నందు, బాబు, రాజ్ కుమార్, కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here