
వార్డ్ మెంబెర్లు, ఏరియా కమిటీ మెంబెర్లు, ముఖ్య నాయకులకు కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పిలుపు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు విద్యానగర్ డివిజన్ కార్యాలయంలో వార్డ్ మెంబెర్లు,ఏరియా కమిటీ మెంబెర్లు ,ముఖ్య నాయకులు కార్యకర్తలు,మహిళ మండలి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతీ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో అధిష్టానం బలపర్చిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా వార్డులకు నియమితులైన ఇంచార్జిలు, వార్డ్ మెంబెర్లు, ఏరియా కమిటీ మెంబెర్లు, నాయకులకు,కార్యకర్తలకు పని చేయాలని అన్నారు. గౌరవ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ గారి ఆదేశాలు, సూచనల మేరకు చందానగర్ డివిజన్ పరిధిలో పట్టభద్రులను గుర్తించి భారీగా ఓటరు నమోదులో పాల్గొనేలా చురుకుగా పని చేయాలన్నారు. 2017 సంవత్సరం నాటికి డిగ్రీ (డిప్లమా) పూర్తి చేసిన వారిని గుర్తించి ఓటు నమోదు చేసుకునేందుకు దరఖాస్తు (ఫార్మ్ 18)తో పాటు దృవీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్లు,ఏరియా కమిటీ మెంబెర్లు ,ముఖ్య నాయకులు కార్యకర్తలు,మహిళ సంఘాలు ,పార్టీ మహిళ విభాగం సభ్యులు మొత్తం సుమారు 150 మంది పాల్గొన్నారు.
