ముస్లిం సోదరులకు బట్టలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్త మహబూబ్ పెట్, స్టాలిన్ నగర్, ఎం ఏ నగర్ లలోని మసీదు లో ముస్లిం సోదరులకు బట్టల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రారంభించి ముస్లిం సోదరులకు బట్టలు పంపిణి చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరిమణులు పండుగను ధనిక,పేద బేధం లేకుండా సుఖసంతోషాలతో జరుపుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఆధ్యాత్మిక దైవ ప్రార్ధనలతో శాంతి, సోదరభావం, సౌభ్రాతృత్వానికి రంజాన్ ప్రతీక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

ముస్లింలకు బట్టలు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here