- సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: నిరుపేదలకు నిస్వార్థంతో సేవ చేయడం ఆ భగవంతుడు కల్పించిన వరమని, నియోజకవర్గాల ప్రజలకి ఏ కష్టం వచ్చినా.. ఏ నష్టం వచ్చినా తాను ఉన్నానని సందయ్య మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్ అన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ శ్రీ తులసి నగర్, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు శిబిరాన్ని ప్రారంభించారు. ఎల్లమ్మ బండ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరం కాంతారావు, సురభి రవీందర్రావు, రామరాజు, నరసింహ చారి, కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి, యాదవ రెడ్డి, ఎత్తరి రమేష్, సందీప్ గౌడ్, కృష్ణ గౌడ్, రవీందర్ రెడ్డి , రామ్ రెడ్డి, నర్సింగ్ రావు ,భాస్కర్ రెడ్డి, రాహుల్, శ్రీనివాస్, రాజు ,స్వప్న, మనిషా ,సైదమ్మ పాల్గొన్నారు.