శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శిల్పావ్యాలీ కాలనీలో పలు సమస్యలు, చేపట్టవలసిన అభివృద్ధి పనులపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వాలా హరీష్, చంద్రశేఖర్ ప్రసాద్, సత్యనారాయణ, కాలనీ అధ్యక్షుడు సిద్దార్థ్ రెడ్డి, అనిల్ రెడ్డి, రమాకాంత్, వేణు గోపాల్, కళ్యాణ్ చక్రవర్తి, రామిరెడ్డి, సుబ్బా రెడ్డి, కృష్ణ, ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు.