
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవడమే టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ షంషీగూడ కి చెందిన మహమ్మద్ షైజాది కి షాదీముబారక్ పథకం క్రింద మంజూరైన రూ.1,00,116 చెక్కును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో లక్ష రూపాయలు అందిస్తున్నారన్నారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఒక వరం లాంటిది అని ఈ పధకం పేదింటి ఆడపిల్లల తల్లితండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకురాలు మంజుల పాల్గొన్నారు.