వివేకానందనగర్ డివిజన్ లో అభివృద్ధి ప‌నుల‌కు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాప‌న‌లు 

 శేరిలింగంప‌ల్లి:  వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని బాగ్ అమీర్, శాంతి నగర్, సుమిత్ర నగర్, వెంకటేశ్వర నగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1 ల‌లో  సుమారుగా రూ.2 కోట్ల 3 లక్షల 15 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న‌ సీసీ రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ లక్ష్మి బాయితో క‌లిసి ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ శంకుస్థాప‌న‌లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ శ్రీ రాములు, ఏఈ సుభాష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ సుధాకర్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు మాధవరం రామారావు, నాయినేని చంద్రకాంత్ రావు, రావు కార్తీక్ రావు, అల్లం మహేష్, శ్రీనివాస్ రెడ్డి, మురళి, అంజి రెడ్డి, సత్యనారాయణ, హరినాథ్, చంద్రమౌళి సాగర్, బాబు రావు, రాధా బాయి, దేవదాసు, మోజేష్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here