ఎమ్మెల్యే సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తా: మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ, జయప్రకాష్ నారాయణ‌ నగర్ కాలనీలలో‌ బుధవారం పట్టణ‌ ప్రగతిని నిర్వహించారు.మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ డీసీ సుదాంష్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి ‌గాంధీ‌ సహకారంతో మియాపూర్ డివిజన్ ‌ను‌ అన్ని‌ రంగాల్లో అభివృద్ధి‌ చేస్తానని అన్నారు. ఆయన వెంట జీహెచ్ఎంసీ నోడల్ ఆపిసర్ రాంమోహన్, శానిటేషన్ సిబ్బంది కనకరాజు తో పాటు నాయకులు సంతోష్, శ్రీనివాస్, రాజు, రామాంజనేయ రెడ్డి, రాఘవ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిలో సమస్యలు తెలుసుకుంటున్న మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here