మియాపూర్ లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

  • జాతీయ జెండా ఎగురవేసి వందనం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 75వ భారత గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి , నార్నె శ్రీనివాసరావు, మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జెండావందనం సమర్పించారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, పార్టీ శ్రేణులు

శేరిలింగంపల్లి నియోజక వర్గ ప్రజలకు 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే అది రాజ్యాంగం మనకు కలిపించిన హక్కు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ ప్రతినిధులు, ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here