శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తోంది : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేస్తోందని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని మియార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మియపూర్ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

మియార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మియపూర్ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమీక్ష సమావేశంలో.. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, శేరిలింగంపల్లి కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుడిలా పని చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బూత్ స్థాయి నుంచే ప్రతిఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇలియస్ షరీఫ్, నడిమిట్టి కృష్ణ, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు శ్రవణ్, సాంబశివరావు, అసిఫ్, నరేందర్ ముదిరాజ్, సమీర్, షరీఫ్, మహమ్మద్ ఖురషీద్, శేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here