మైనారిటీల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌త్యేక కృషి: ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్రత్యేక కృషి చేస్తున్న‌ట్లు మియాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్ అన్నారు. మంగ‌ళ‌వారం డివిజ‌న్ ప‌రిధిలోని ఎమ్ఎన‌గ‌ర్‌లో రంజాన్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా బట్ట‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్ మాట్లాడుతూ  మైనారిటీ ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ అండ‌గా టిఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉంటుంద‌ని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నార‌ని తెలిపారు. కరోనా సంక్ష‌భంలోనూ ప్రజలు పండగను సంతోషంగా జరుపుకోవాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగ‌ను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జలీల్ మియా, అల్లావుద్దీన్, యాదుల్లా టిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, ఎల్ రాజు, విజయ్ ముదిరాజ్, జంగం మల్లేష్, శివ ముదిరాజ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద ముస్లీంల‌కు రంజాన్ తోఫా అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ ఉప్ప‌ల‌పాటి శ్రీ‌కాంత్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here