మహిళలను ఒక అమ్మ, ఒక చెల్లిగా చూసుకోవాలి: రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ బిజెపి పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ మహిళల పట్ల అపారమైన గౌరవంతో ప్రతి ఒక్కరూ మెదులుకోవాలని, ప్రతి ఒక్కరిలో ఒక అమ్మ, ఒక చెల్లిని చూసుకోవాలని తెలియజేస్తూ.. నేటి తెలంగాణ ప్రభుత్వ పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపలేని ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ మహిళలపై నిత్యం అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం ఏ ఒక్క రోజైనా స్పందించని కవిత, మహిళా రిజర్వేషన్ పై ధర్నా చేయడం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు.

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు కానుకలు అందజేస్తున్న రాష్ట్ర నాయకుడు రవి కుమార్ యాదవ్

నియోజకవర్గంలో ఒక మహిళా కార్యకర్త గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన వంతు ఆర్థిక సహాయాన్ని అందించి మనోధైర్యాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో మహిళా డివిజన్ అధ్యక్షురాలు శ్రీలత, లలిత రెడ్డి, మాధవి విమల, అరుణ, దేవి రెడ్డి, మమత, లక్ష్మీ, కిరణ్, స్వప్న, నాయకులు చారి, నర్సింగ్ రావు, వెంకటస్వామి రెడ్డి, రమేష్, రఘునాసెట్, ఆంజనేయులు యాదవ్, విష్ణు, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here