విశ్వ కళ్యాణం, లోక సంక్షేమం కోసం మహాయాగం

  • పాల్గొని పూజలు చేసిన మొవ్వ సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: “విశ్వ కళ్యాణం లోక సంక్షేమం కోసం” మాజీ మాజీ హోం మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ కుటుంబ సభ్యులు “చతురాయతన శత చండీ సహిత శ్రీ రాజశ్యామలా మహా యాగం వేద మంత్రోచ్చరణల నడుమ వేడుకగా నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ ఆహ్వానం మేరకు ఈ యాగంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కంటెస్టెడ్ MLA శ్రీ మొవ్వా సత్యనారాయణ హాజరై యాగ ఫలాలు, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని, మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ ని, జిల్లా అధ్యక్షులు సామ రంగా రెడ్డి తదితర సీనియర్ నాయకుల్ని మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here