నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జీ డి. సురేష్, నగేష్, వెంకట్ సామ రెడ్డి, మన్నె సతీష్, జైపాల్, రఘునందన్ రెడ్డి, శ్రీనివాసులు, రేణుక, మైనారిటీ సెల్ సభ్యులు, ఎన్ ఎస్ యూ ఐ , యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
