గోకుల్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో కార్తిక మాసం యాదవ వనభోజనం మహోత్సవం

శేరిలింగంపల్లి, నవంబ‌ర్ 2 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): కుత్బుల్లాపూర్ గోకుల యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళనంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యాదవ కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉంద‌న్నారు. ఇంత మంది యాదవులను ఒకచోట చేర్చి యాదవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన గోకుల యాదవ సంఘంను అభినందించారు. ఈ సమయంలో యాదవుల ఐక్యత అవ‌స‌ర‌మ‌న్నారు. యాదవ నాయకులు ముందుకొచ్చి బీసీల రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల తరఫున యాదవ సంఘం నాయకులు యాదవ ప్రజలు కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీసీ ప్రజానీకానికి సేవ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి, సర్పంచుల‌ ఫోరం వ్యవస్థాపకుడు భూమన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందెల కుమార్ యాదవ్, రాజశేఖర్ యాదవ్, రవి యాదవ్, శివకుమార్ యాదవ్, గోకుల యాదవ సంఘం సభ్యులు, యాదవ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here