మే 3 న నాగోల్ లో యాదవుల ఆత్మగౌరవ సభ – రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యేషాం మల్లేష్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో యాదవుల ఆత్మగౌరవ సభ ను మే 3వ తేదీన ఉదయం 10 గంటలకు నాగోల్ లోని శుభం‌ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా వంతుల వేదిక సోషల్ మీడియా కో ఆర్డినేటర్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన కార్యదర్శి యేషాం మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులు విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వాటా కోసం యాదవుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యాదవులు ఈ సభకు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక సోషల్ మీడియా కో ఆర్డినేటర్ యేషాం మల్లేష్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here