మ‌హా స్కంధ ష‌ష్టి సంద‌ర్బంగా సుబ్రమణ్య స్వామి వారికి పూజ‌లు

చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మహా స్కంధ షష్టి సందర్భంగా ఉదయం 7 గంట‌లకు శ్రీ వల్లీ శ్రీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి వారికి పంచామృత మహా అభిషేకాన్ని ఆలయ ప్రధాన అర్చకులు సత్యసాయి ఆచార్యులు, రమేష్ శర్మ, రవిశర్మ నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారికి పూజ‌ల‌ను నిర్వ‌హించారు. అనంత‌రం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఉదయం 10 గంట‌ల‌ నుండి 12 గంట‌ల‌వరకు ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వ‌హించారు.

స్వామి వారికి అభిషేకం నిర్వ‌హిస్తున్న దృశ్యం
పూజ‌ల్లో పాల్గొన్న భ‌క్తులు
ఉత్స‌వ‌మూర్తికి పుష్పాల‌తో పూజ‌లు చేసిన దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here