- రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శేరిలింగంపల్లి నగర్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): అయోధ్యలో భవ్యరామ మందిర నిర్మాణం నేపథ్యంలో చేపట్టనున్న జనజాగరణ కార్యక్రమ నిమిత్తం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శేరిలింగంపల్లి నగర్ ఆద్వర్యంలో తారానగర్ విద్యానికేతన్ స్కూల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ కుకట్ పల్లి భాగ్ సహ కార్యవాహ్ యాదగిరి, శేరిలింగంపల్లి నగర సంఘచాలక్ గాల్ రెడ్డి, కార్యవాహ్ కార్తిక్, ప్రచార ప్రముఖ్ చెన్నారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకుడు భాస్కర రెడ్డి భాస్కర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి, మహిళా ప్రముఖ్ నందనం వినయ, విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణలతో పాటు ఆర్ఎస్ఎస్ అనుబంధ క్షేత్రాల కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అయోధ్య భవ్య రామమందిర నిర్మాణం బాధ్యతలు చేపట్టిన శ్రీ రామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు అనుబంధంగా నిధుల సేకరణతో పాటు, పెద్ద సంఖ్యలో హిందూ బంధువులను ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు అనుసరించాల్సిన అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. శేరిలింగంపల్లి నగరంలో గుర్తించిన 30 వేల హిందూ కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసేందుకు యోజన చేశారు. బస్తీల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి ద్వారా నగరంలోని ప్రతి కుటుంబాన్ని ఈ గొప్ప కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు శ్రీరాముడి భవ్య మందిర నిర్మాణానికి ముందుకు వచ్చినప్పటికీ శతాబ్దాల కల నెరవేరవేరనున్న తరుణంలో ప్రతి హిందూ బంధువు రామకార్యంలో భాగస్వాములను చేయాలనే ఉద్ధేశంతో జన జాగరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. వనవాసి కల్యాణ్ పరిషత్, ఏబీవీపీ, బిజెపి, బిఎంఎస్, వీహెచ్ పి, భజరంగ్ దళ్, రాష్ట్ర సేవికా సమితి, హిందు వాహిని, ప్రజ్ఞ భారతి సేవాభారతి, సంస్కృత భారతిలతో పాటు సంఘ పరివారంం అంతా జన జాగరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
