శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జల వాయు విహార్, HMT హిల్స్ కాలనీలలో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కార్పొరేటర్ శ్రీ నార్నె శ్రీనివాసరావు, ఇంజనీరింగ్, జలమండలి , ఇరిగేషన్ అధికారులు, కాలనీ వాసులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కాలనీలలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జల వాయు విహార్, HMT హిల్స్ కాలనీల వాసులు మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు వేయాలని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీలలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఇరిగేషన్ AE లక్ష్మీనారాయణ, జలమండలి మేనేజర్ ప్రియాంక, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీల వాసులు తదితరులు పాల్గొన్నారు.