శేరిలింగంపల్లి, జూన్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు చెరువు సమీపంలో నూతనంగా భూగర్భ డ్రైనేజ్ లైన్ నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పటేల్ చెరువు సమీపంలో నూతనంగా భూగర్భ డ్రైనేజ్ లైన్ నిర్మాణం చేపట్టబోయే పరిసర ప్రాంతాలను మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరిశీలించడం జరిగిందని, భూగర్భ డ్రైనేజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం అని, ఎఫ్ సి ఐ కాలనీలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో భూగర్భ డ్రైనేజి పైప్ లైన్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులు రామ్, చైతన్య, జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.