చందానగర్ శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను తక్షణమే చేపట్టాలి: కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి

శేరిలింగంపల్లి, మే 25 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్‌లోని శ్రీదేవి థియేటర్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి డిమాండ్ చేశారు..శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవరావుని కలిసి ఆమె ఈ మేరకు విజ్ఞప్తి చేశారు..శ్రీదేవి థియేటర్ నుంచి అమీన్‌పూర్ వరకు వెళ్లే ఈ మార్గంలో రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చందానగర్ నుంచి అమీన్‌పూర్ మార్గంలో వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగాయని, దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జోనల్ కమిషనర్ వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె జోనల్ కమిషనర్‌ను కోరారు..రాబోయే వర్షాకాలంలో వర్షాల కారణంగా రోడ్డుపై వాహనదారులు మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని కార్పొరేటర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ నియంత్రణకు ఈ రోడ్డు విస్తరణ పనులు అత్యవసరం అని జోనల్ కమిషనర్‌కు తేలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here