శేరిలింగంపల్లి, మే 27 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై భారాస సీనియర్ నేత, శేరిలింగంపల్లి యువనాయకుడు రవీందర్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కుట్ర పూరితంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలను చేస్తుందని విమర్శించారు. ఫార్ములా ఈ కేసుతో వేధింపులకు దిగుతున్నారన్నారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్ దే అన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. ఈడీలో రేవంత్ రెడ్డి పేరు ఉందని, రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న కేటీఆర్ ప్రశ్నించారన్నారు. దాన్ని జీర్ణించుకోలేకనే ఫార్ములా ఈ పేరుతో నోటీసులు ఇచ్చి అల్ప సంతోషానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈడీ ఛార్జ్ షీట్ పై సమాధానం చెప్పాలని రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు.