శేరిలింగంపల్లి, మే 28 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామా రావు(ఎన్టీఆర్) 102వ జయంతిని పురస్కరించుకుని వసంత్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూన సత్యం గౌడ్, కావూరి ప్రసాద్, ఉరిటి వెంకట్ రావు, మన్నెపల్లి సాంబశివరావు, కట్ల శేఖర్ రెడ్డి, సౌందర్య రాజన్, రమణ, వెంకట్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.