శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, ఎఫ్.సి.ఐ కాలనీ, బాలాజీ నగర్, ఆదిత్య నగర్, JP నగర్, AS రాజు నగర్ కాలనీలలో రూ. 85 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే భూగర్భ డ్రైనేజి(UGD) పైప్ లైన్ నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఏ చిన్న సమస్య అయిన తన దృష్టికి గాని , కార్పొరేటర్ దృష్టికి వచ్చినా తప్పకుండా పరిష్కరిస్తామని అన్నారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ , కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతూ సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీలుగా తీర్చిదిద్దడమే ప్రథమ లక్ష్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM నారాయణ, DGM అమీరుద్దీన్, మేనేజర్ సునీత, నాయకులు , కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.
భారతి నగర్లో..
భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీ లో రూ.93 లక్షల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు, రూ. 23.50 లక్షల ఎమ్మెల్యే సీడీపీ నిధులతో నిర్మించిన షటిల్ కోర్ట్ ను కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డితో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.