శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ అంబీర్ చెరువు ఔట్ లెట్ (తూము) స్థితిగతులను ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్, కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, ఇరిగేషన్ అధికారుల తో కలిసి PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అంబీర్ చెరువు పూర్తిగా నిండు కుండలా మారిందని, ఔట్ లెట్ వద్ద పరిస్థితిని, చెరువు కట్ట సామర్థ్యంను పరిశీలించడం జరిగిందని అన్నారు. ఔట్ లెట్ ద్వారా వెలువడుతున్న నీటి ప్రవాహం ద్వారా చెరువు దిగువున ఉన్న కాలనీ లు, లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా ఇరిగేషన్ అధికారులు ముందస్తు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. తూమును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని , వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నరేందర్, AE లక్ష్మీ నారాయణ, నాయకులు రంగరాయ ప్రసాద్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దొడ్ల రామ కృష్ణ గౌడ్, MD ఇబ్రహీం, జిల్లా గణేష్, కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.