మియాపూర్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి: కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రోడ్డులో నూతనంగా నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణం పనులను GHMC అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప‌రిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం రోడ్డును నూతనంగా నిర్మాణం చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని అన్నారు. మియాపూర్ డివిజన్ లోని ప్రతి కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, సీసీరోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తులా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ జగదీష్, అన్వర్, స్థానిక నాయకులు ప్రతాప్ రెడ్డి, రాము, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here