బీసీల బహుజనుల రాజ్యాన్ని సాధిస్తాం: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల భారత బీసీ సేన బహుజనుల ముచ్చట్ల కార్యక్రమంలో 33 జిల్లాల నుండి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సినీ నిర్మాత చిన్న శ్రీశైలం యాదవ్, ప్రజా గాయకుడు గద్దర్ తనయుడు సూర్యం, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మాజీ ఎంపిటిసి రాములు యాదవ్, కటారి అంజయ్య యాదవ్, బహుజన నాయకులు అందెల కుమార్ యాదవ్, మొర్రి లింగం, అంజయ్య యాదవ్, సుధాకర్ యాదవ్, బహుజన కళాకారుడు గణేష్, పాటల రచయిత అశోక్, BC, SC, ST మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ అఖిలభారత బిసి సేన ఆధ్వర్యంలో బహుజనులు అందరూ ఏకమై బహుజన రాజ్యాధికారం సాధించడానికి ముందుకు కొనసాగుతామని అన్నారు. ఈ బహుజన రాజ్యంలో కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ అన్ని కులాల నుండి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తామ‌న్నారు. గుర్తింపు లేని కొన్ని జాతి జాతులను సమాజంలో మేలు కొలుపుతామ‌ని, అఖిల భారత బీసీ సేన ఆధ్వర్యంలో బీసీల బహుజనుల రాజ్యాన్ని సాధిస్తామని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here