వృథాగా పోయిన నీరు.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేసిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి‌‌‌‌‌‌‌ ‌‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న మంజీరా మంచి నీటి పైపులైన్ లీక్ అయి నీరు వృథాగా రోడ్డుపై ప్రవహించడం గమనించిన శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంబంధిత అధికారులను సంఘటనా స్థలానికి పిలిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచినీరు వ్యర్థం కాకుండా యుద్ధ ప్రాతిపదికన తగుచర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే ట్రాన్స్‌మిషన్ సిబ్బందిని పిలిపించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రింప‌జేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండబ్య్లుఎస్ ట్రాన్స్‌మిషన్ డిఏఈ ముస్త‌ఫా ఆలీ, తెరాస పార్టీ డివిజన్ గౌరవ అధ్య‌క్షుడు దుర్గం వీరేశంగౌడ్, మాజీ కౌన్సిల‌ర్ సోందాస్, తెరాస నాయకులు కొండల్ రెడ్డి, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, నెహ్రు నగర్ కమిటీ అధ్య‌క్షుడు డి.శ్రీకాంత్, గాఫర్, గణపురం రవీందర్, సాయి పాల్గొన్నారు.

స‌మ‌స్య‌ను ప‌రిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here