నమస్తే శేరిలింగంపల్లి: వివేకానంద నగర్ డివిజన్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతూ బిజెపి డివిజన్ ఇన్చార్జీ ఉప్పల విద్య కల్పన ఏకాంత్ గౌడ్ సోమవారం కుకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు వినతి పత్రం అందజేశారు. హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్ మూడు డివిజన్లకు సంబంధించి ఎల్లమ్మ బండ లో ఒకే ఒక్క కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ఉందని ఈ క్రమంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ ప్రజలకు దగ్గరగా డివిజన్ లోని వెంకటేశ్వర నగర్ లేదా బాగ్ అమీర్లోని బస్తీ దవాఖానలలో కరోనా వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన జడ్సీ మమత జిల్లా వైద్యాధికారితో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామి ఇచ్చినట్టు తెలిపారు.
