శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ న్యూ కాలనీలో స్థానిక శ్రీ విజయ వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో గణేషుడి లడ్డూను రూ.2.15 లక్షలకు బాలింగ్ సురేష్ గౌడ్ కైవసం చేసుకున్నారు.






