వివేకానంద నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాస్ రెడ్డి, శంకర్ గౌడ్, వెంకటేష్, రవి చారీ, బాలాచారి, లక్ష్మీనరసయ్య పంతులు, సిద్దులు, మోహన చారీ, తిరుపతి చారి, పాపారావు, యాకయ్య, సోమయ్య నేత, నరసింహ ముదిరాజ్, నరసింహ గౌడ్, బ్రహ్మ చారి, కిషన్ రావు, నరేందర్, సాయి రెడ్డి, బలరాం, పరమేష్ చారీ, దివాకర్, శ్రీకాంత్ చారీ, నరేందర్ రెడ్డి, బలవంత రావు ఉన్నారు.
