శాకాంబరి దేవిగా లలిత పోచమ్మ దర్శనం

నమస్తే శేరిలింగంపల్లి: ఆషాఢ మాసం బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి లలిత పోచమ్మ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకం, అర్చనలతో ప్రత్యేక పూజలు చేశారు. పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించగా భక్తులకు శాకాంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఆదివారం నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని గుర్రపు రవీందర్ రావు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.‌

శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ శ్రీ శ్రీ లలిత‌ పోచమ్మ మాత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here