శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సేవలు అభినందనీయం – ప్రభుత్వ విప్‌ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: పౌష్టికాహారంతో పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చిన శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ ను ప్రభుత్వ విప్,‌ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభినందించారు. మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అంగన్ వాడీ కేంద్రంలోని 0-5 సంవత్సరాల పిల్లలకు సాయి షూర్ న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారి సేవలు అభినందనీయమని అన్నారు. అంగన్ వాడి కేంద్రాలలో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహారం లోపం కలగకుండా ఉండేందుకు సాయి షూర్ న్యూట్రిషన్ పౌడర్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో సుమారు 250 మంది పిల్లలను గుర్తించి పౌష్టిక ఆహారాన్ని ఆర్నెల్ల పాటు ఈ ఫౌడర్ ను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీ బాయి, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సభ్యులు దనుంజయ్ రావు, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహాయంతో న్యూట్రిషన్ పౌడర్ డబ్బాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here