శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్లోని హుడా కాలనీలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మాత జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు వందల మంది కుంకుమార్చన, వాసవి మాత పారాయణం చేశారు. మూడు వందల మందికి పైగా శ్రీ వాసవి మాత దర్శనం చేసుకున్నారు. దేవాలయ చైర్మన్ పోల వాణీ కోటేశ్వర్ రావు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ మారం వెంకట్, బాదం సాయిబాబు, ఉషా రాణి, సత్యనారాయణ, మెంబర్స్ బాలయ్య , పృథ్వి , హిరహ్మయి , రాణి సుధాకర్, రాచూరి రాము, సుదర్శన్ రావు, రాములు, జితమన్యు, ఆర్య వైశ్య సంఘం, భక్తులు పాల్గొన్నారు.