చిత్రపురి కాలనీలో వి వ్రాప్ గిఫ్టింగ్ స్టూడియో ప్రారంభం

శేరిలింగంపల్లి, మే 5 (న‌మస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడ చిత్రపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వి వ్రాప్ గిఫ్టింగ్ స్టూడియోను శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన వి వ్రాప్ గిఫ్టింగ్ స్టూడియో య‌జ‌మానుల‌కి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. ఎక్కడెక్కడికో వెళ్లి గిఫ్ట్ ఐటమ్స్, ఇతర వస్తువులు తెచ్చుకునేవాళ్ళమ‌ని, నేటి అత్యాధునిక టెక్నాలజీ తో మారుతున్న కాలంతో అన్ని మనకి ద‌గ్గర్లోనే దొరకడం సంతోషకరమైన విషయం అని అన్నారు. ప్రజలకు అందుబాటు ధరలు ఉంచి దిగువ మధ్య తరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హరి కృష్ణ, స్నేహ, డిఎస్ఆర్ గ్రూప్ డైరెక్టర్ అమూల్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here