స్టాలిన్ నగర్ లో రోడ్లు, డ్రైనేజీ పూడిక చేపట్టాలి – ఉప కమిషనర్ కు మైదంశెట్టి రమేష్ వినతి 

నమస్తే శేరిలింగంపల్లి: స్టాలిన్ నగర్ లో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూడికలు చేపట్టాలని జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్ కు స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మైదంశెట్టి రమేష్, సంక్షేమ సంఘం ప్రతినిధులు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప కమిషనర్ తో మైదంశెట్టి రమేష్ మాట్లాడుతూ గత సంవత్సరం రూ. 46 లక్షలు వెచ్చించి స్టాలిన్ నగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేశారు, కానీ మరో రెండు గల్లీలు వేయకుండా ఆపేయడంతో సమస్య మొదలైందని తెలిపారు. పాత రోడ్డు మార్గంలో తీసిన పూడికలను అలాగే ఉంచడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికైనా స్టాలిన్ నగర్ లో యు జి డి కోసం చేపట్టిన పనులలో పగిలిపోయిన మ్యానువల్స్ సరిచేసి కాలనీ మొత్తంలో కొత్తగా రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. ఉప కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో మైదం శెట్టి రమేష్, సంక్షేమ సంఘం ప్రతినిధులు గుడా లావణ్య, ఎం రాణి,ధార లక్ష్మి ఉన్నారు.

జిహెచ్ఎంసి చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్ కు వినతి పత్రం ఇస్తున్న స్టాలిన్ నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మైదంశెట్టి రమేష్, సంక్షేమ సంఘం ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here