అసంపూర్తి భూగర్భ డ్రైనేజీ లైన్ ను వెంటనే పూర్తిచేయండి: రాగం 

నమస్తే శేరిలింగంపల్లి : అసంపూర్తిగా ఉన్నభూగర్భ డ్రైనేజీ లైన్ పనులను వెంటనే పూర్తిచేయాలని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ కు అవుట్ లెట్ పనులను పూర్తిగా చేయకపోవడంతో మ్యాన్ హోల్స్ నుండి డ్రైనేజ్ వాటర్ రోడ్లపైకి ప్రవహిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న రాగం నాగేందర్ యాదవ్ మంగళవారం బృందావన్ కాలనీలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ శాఖ అధికారులు, HMWS&SB ఏరియా మేనేజర్ తో పర్యవేక్షించి సంబంధిత అధికారులకు అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. స్థానిక కాలనీవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఈఈ శ్రీనివాస్, ఏఈ సునీల్, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్&ఎస్.బి ఏరియా మేనేజర్ సుబ్రహ్మణ్యం రాజు , డివిజన్ అధ్యక్షులు దుర్గం వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, లింగంపల్లి విలేజ్ తెరాస ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, స్థానిక కాలోనివాసులు పాల్గొన్నారు.

బృందావన్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ లైన్ పనులను జిహెచ్ఎంసి అధికారులు, HMWS&SB ఏరియా మేనేజర్ లతో పర్యవేక్షిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here