భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం లాంటిది: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, జూన్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భూమి ఉన్న ప్రతి రైతుకు భూ భద్రత క‌ల్పిస్తామ‌ని, మనిషికి ఆధార్ కార్డు లాగానే భూమికి భూదార్ ఉంటుంద‌ని, రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాల‌ని, భూ సమస్యలను పరిష్కరించుకోవాల‌ని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గౌలిదొడ్డి వార్డు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్, తహసిల్దార్ వెంకా రెడ్డి, కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, నార్నె శ్రీనివాసరావుల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ భూ భారతి – కొత్త ఆర్ ఓ ఆర్ చట్టమని అందులో భాగంగా భూమి హక్కులు భద్రం, భూ సమస్యల సత్వర పరిష్కారం జ‌రుగుతాయ‌ని అన్నారు. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు అని పేర్కొన్నారు. భూ భారతి చట్టం రైతుల చుట్టమని అన్నారు. రైతుల మేలు కోసం ప్రజా పాలనలో చారిత్రక మార్పు కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది RI చంద్రారెడ్డి, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here