యూజీడీ సమస్యను పరిష్కరిస్తాం – కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ ఓల్డ్ విలేజ్ లో నెలకొన్న అంతర్గత డ్రైనేజీ సమస్యలను స్థానిక నాయకులు, అధికారులతో కలసి స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్ పరిశీలించారు. అంతర్గత డ్రైనేజీ సమస్యలను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. త్వరితగతిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులకు కార్పొరేటర్ హమీద్ పటేల్ ఆదేశించారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి రోడ్లను వెంటనే పునరుద్దించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈ రమేష్, ఏఈ జగదీష్, వాటర్ బోర్డు మేనేజర్ నివర్తి, సీనియర్ నాయకులు శాస్త్రి యాదవ్, శ్రవణ్ యాదవ్, రాజు యాదవ్, సిల్వర్ శ్రీను, బిక్షపతి ముదిరాజ్ తదితరులు ఉన్నారు.

యూజీడీ సమస్యను పరిశీలిస్తున్న కొండాపూర్ కార్పొరేటర్ హమీద్ పటేల్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here