నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ సర్కిల్ పరిధిలోని ఇందిరా నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు చందానగర్ డీసీ, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఇందిరానగర్ లోని ఇం.నం 9-105 సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కసిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు రోగాల భారిన పడుతున్నారని, ముగ్గురు ఫెరాలసిస్ బారిన పడ్డారన్నారు. పరిస్థితి ఇలానే ఉంటే ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలు కావల్సి వస్తుందన్నారు. సమస్యను దృష్టిలో పెట్టుకుని యుద్ధప్రాతిపదికన డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
