శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి గ్రామంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన ఉగాది ఉత్సవాలలో పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ లతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో భక్తులు, నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని, భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, బీజేపీ శ్రేణులు, భక్తులు, గోపనపల్లి గ్రామం వాసులు, మహిళలు, పిల్లలు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.