ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులకు పార్టీలో సముచిత స్థానం ఇచ్చి రాజకీయంగా అవకాశం కల్పించాలని ఉద్యమకారులు ఆకాంక్షించారు. గురువారం చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట‌లో సలీం నివాసంలో ఉద్యమకారులు సమావేశమయ్యారు. ఉద్యమకారులమంతా ఏకతాటిపై ఉండి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటి ఉద్యమకారులకు పార్టీలోనూ, రాజకీయంగాను మంచి అవకాశం కల్పిస్తే ఎంతోబాగుంటుందని అన్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములం అవుతామని అన్నారు. సమావేశమైన వారిలో సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, షేక్ జమీర్, దేవేందర్ రావు, ప్రశాంత్, మిద్దెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.

సలీం నివాసంలో కలిసిన‌ ఉద్యమకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here