ఏకమవుతున్న శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ఉద్యమ కారులను ఏకం చేస్తున్న ఉద్యమ కారులు ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని కైలాస్ నగర్ లో నివాసం ఉంటున్న ఉద్యమకారుడు దుర్గాప్రసాద్ ను తోటి‌ ఉద్యమకారులు కలిశారు. దుర్గాప్రసాద్ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై చేసిన వంటావార్పు తదితర అంశాలను‌‌ గుర్తు చేసుకున్నారు. దుర్గాప్రసాద్ తోటి ఉద్యమకారులకు తన వ్యవసాయ క్షేత్రంలో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, మిద్దెల మల్లారెడ్డి, ఎస్. రవీందర్ రావు, జైపాల్ రెడ్డి, జగన్, యాదగిరి, మురహరి, దుర్గయ్య, సురేష్ పాల్గొన్నారు.

దుర్గాప్రసాద్ ను కలిసిన ఉద్యమకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here