టీపీయూఎస్ఎస్ గ్రేటర్ జనరల్ సెక్రటరీగా వేణుమాధవ్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి:తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా వేణుమాధవ్ రెడ్డిని గ్రేటర్ అధ్యక్షుడు చిట్టా రెడ్డి ప్రసాద్ నియమించారు. ఈ మేరకు వేణుమాధవ్ రెడ్డికి నియామకపు ఉత్తర్వులను అందజేశారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ లో బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయిలో కమిటీని వేయడం జరుగుతుందని టీపీయూఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చిట్టారెడ్డి ప్రసాద్ పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వేణుమాధవ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశాంత్ చారి, మహిళ అధ్యక్షురాలు గాయత్రి గుప్తా, సెక్రెటరీ జనరల్ యాషం శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు రవిప్రకాష్ రెడ్డి, మహిళ నాయకురాలు అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

టీపీయూఎస్ఎస్ గ్రేటర్ జనరల్ సెక్రటరీగా వేణుమాధవ్ రెడ్డికి నియామకపత్రం అందజేస్తున్న చిట్టారెడ్డి ప్రసాద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here