ఉద్యమకారులంతా ఏకతాటిపైకి రావాలి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉద్యమకారులంతా ఏకతాటిపైకి రావాలని పలువురు ఉద్యమకారులు పిలుపునిస్తున్నారు. ఈ మేరకు ఉద్యమకారులను ఏకం చేస్తున్న క్రమంలో మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ లో సంకటి స్వామి ఇంటికి ఉద్యమ కారులు వెళ్లి కలిశారు. ఉద్యమ సమయంలో చేసిన పోరాటాలు, ధర్నా, రాస్తారోకో తదితర అంశాలపై కాసేపు ముచ్చటించారు. ఉద్యమకారులకు తగిన గుర్తింపునివ్వాలని, రాజ్యాంగబద్దమైన పలు ఫోస్టులను ఉద్యమకారులతో భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగారం సంగారెడ్డి, దేవేందర్ రావు, జమీర్, వెంకన్న, సోమేశ్వరరావు, మిద్దెల మల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here